సికింద్రాబాద్, అక్టోబర్ 31 (వాయిస్ టుడే ప్రతినిధి):దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం అత్యంత నీచమైన చర్య అని కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు పచ్చటి తెలంగాణలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది ప్రజలే చెపుతారనీ ఇలాంటి రాజకీయాలను ఎండగట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు 14 సంవత్సరాల పాటు కేసిఆర్ నెత్తురు బొట్టు నెల రాలకుండ అహింస మార్గములో తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు ముఖ్యమంత్రిగా కేసిఆర్ గత 10 సంవత్సరాల కాలంగా ప్రశాంతంగా ఎలాంటి అలజడులకు తావు లేకుండా పరిపాలిస్తున్నారనీ తెలంగాణలో అధికారం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాయని కేసిఆర్ ముందే చెప్పారని అది ఇప్పుడు నిజమైంది అని అన్నారు నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్, బిజెపి నేతలు విచ్చల విడిగా అడ్డు అదుపు లేకుండా వాడుతున్న బాషా తెలంగాణ సమాజానికి మంచిది కాదు అన్న కేసిఆర్ మాట ఆవిష్కృతం అవుతున్నాయని తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నం ను తీవ్రంగా ఖండిస్తున్నా మన్నరు, ప్రజాస్వామ్యంలో హత్య రాజకీయాలు మంచిది కాదు అని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.