ఎంపి ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి జరిగింది. సోమవారం ఉదయం  దౌలతాబాద్ మండలం సూరంపల్లి లో అయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి  కత్తితో దాడి చేసాడు. అప్రమత్తమయిన పార్టీ కార్యకర్తలు ఎంపి ప్రభాకర్ రెడ్డిని  కారు లో పంపించి వేసారు. తరువాత దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పచెప్పారు.  పోలీసులు విచారణ చేపట్టారు.