Sunday, September 8, 2024

దాడులతో సాధించేదేమీ లేదు:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్

- Advertisement -

దాడులతో సాధించేదేమీ లేదు

మధుయాష్కి గౌడ్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు

50వేల మెజార్టీతో మధుయాష్కి గెలుపు ఖాయం

:విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

దాడులతో కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చూడడం మూర్ఖత్వమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేటలోని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపై ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి పోలీసులతో దాడులు చేయించడం సిగ్గుచేటని అన్నారు. సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రెండు పర్యాయాలు కార్పొరేటర్ గా, హుడా చైర్మన్ గా, రెండు పర్యాయాలు ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచి అన్నీ పదవులు అనుభవించిన తర్వాత, అభివృద్ధి పేరుతో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన మచ్చలేని నాయకుడు మధు యాష్కికి గౌడ్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక సుధీర్ రెడ్డి ఇలాంటి దాడులను చేయిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు భయపడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 50వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కిగౌడ్ విజయం సాధిస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కమిటీ సభ్యులు ఇరిగి రమేష్, నాయకులు రఘునందన్, బండ సురేందర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్