Sunday, September 8, 2024

వివాహిత పై హత్యాయత్నం ఆపై యువకుడి ఆత్మహత్య

- Advertisement -

స్కూల్ టీచర్ తో యువకుడి అక్రమ సంబంధం
వివాహిత పై హత్యాయత్నం
ఆపై యువకుడి ఆత్మహత్య
విజయవాడ
శ్రీనగర్ కాలనీకి చెందిన ఓ మహిళకు గుడివాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే స్కూళ్లో టీచర్గా పనిచేస్తున్న మహిళకు అక్కడే ఓ యువకుడితో పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే బాధితురాలు కొంతకాలం క్రితం గుడివాడ నుంచి విజయవాడకు వచ్చేసింది. దీనిపై ఇద్ద మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తనను వదిలేసి వచ్చిందనే కోపంతో ఆ యువకుడు విజయవాడకు వచ్చి మహిళపై దాడి చేశాడు. కత్తితో విచక్షణారహితంగా నరికాడు. అయితే యువకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన వివాహిత.. రక్తపు మడుగులో పడిపోయింది.
దీంతో మహిళ చనిపోయిందని నిర్ధారించుకున్న యువకుడు.. ఆపై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు.. కొనఊపిరితో ఉన్న యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన మీద కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్