Sunday, September 8, 2024

అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు.

- Advertisement -

అట్టహాసంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు...

జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మంది ఆడుదాం ఆంధ్రలో రిజిస్ట్రేషన్…

నంద్యాల

క్రీడలు మానసిక ఉల్లాసానికి ప్రతీకని… జిల్లావ్యాప్తంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో ప్రారంభిస్తున్నట్లు MLC ఇసాక్ భాషా తెలిపారు. ఈ సందర్భంగాఎమ్మెల్సీ ఇసాక్ బాష మాట్లాడుతూ యువతలో క్రీడోత్సాహాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో,  బ్యాడ్మింటన్ క్రీడాంశాలను తొలుత సచివాలయ స్థాయిలో పోటీల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారన్నారు.  ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు నంద్యాల జిల్లాలో క్రీడాకారుల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఐదు క్రీడాంశాలలో తలపడేందుకు జిల్లా నుంచి ఒక లక్ష 25 వేల మంది క్రీడాకారులు వారి పేర్లను నమోదు చేసుకున్నారని, అత్యధికంగా క్రికెట్ క్రీడలో పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. క్రీడల ద్వారా గ్రామస్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికలపై పోటీపడేలా  తీర్చిదిద్దడం, అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం ఈ క్రీడల యొక్క ప్రధాన లక్ష్యాలని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్