Sunday, March 8, 2026

బండి సంజయ్ వర్సెస్ పొన్నం,,,

- Advertisement -

బండి సంజయ్ వర్సెస్ పొన్నం,,,

Bandi Sanjay Vs Ponnam

కరీంనగర్, జనవరి27, (వాయిస్ టుడే)
లంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో ఆసక్తికర పరిణామంతో.. ప్రజలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్నవరకు తిట్టుకున్నవాళ్లు.. తెల్లారేసరికి భూజాల మీద చేతులేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.. అప్పటివరకు నవ్వుకుంటూ మాట్లాడుకున్నవాళ్లు కూడా కాసేపట్లో విమర్శలు చేసుకునే విచిత్ర సందర్భాలు ఎదురవుతుంటాయి. కాగా.. ప్రస్తుతం తెలంగాణలోని కరీంనగర్‌లో నడుస్తున్న రాజకీయం చూస్తుంటే.. అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి.గణతంత్ర దినోత్సవం సందర్భంగా  రేవంత్ రెడ్డి సర్కార్ 4 పథకాలు ప్రారంభించగా.. అందులో ఇందిరా గాంధీ ఇండ్ల పథకం, కొత్త రేషన్ కార్డులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై నోరుపారేసుకుంటే సహించేది లేదని బండి సంజయ్‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు, ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు డబ్బులు ఇవ్వరో చూస్తామని హెచ్చరించారు. పథకాలకు డబ్బులు బండి సంజయ్ తన ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని విమర్శించారు. ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా.. ఎలా ఇవ్వరో చూస్తామన్నారుఇందిరా గాంధీని బీజేపీ ప్రధాని అయిన వాజ్‌పాయి కాళీమాతతో పొల్చారని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. 10 నెలల కాలంలో జీఏస్టీ రూపంలో రూ.37 వేల కోట్లను కేంద్రం వసూలు చేసిందని తెలిపారు. మరి తెలంగాణకు కేంద్రం ఎంతిచ్చిందని ప్రశ్నించారు. దీన్ దయాల్ అంత్యోదయ, దీన్ దయాల్ గృహజ్యోతి లాంటి పేర్లు పథకాలకు కేంద్రం ఎందుకు పెట్టిందని ప్రశ్నించారు. వాళ్లు ఏమైనా దేశం కోసం ప్రాణత్యాగం చేశారా.. అని మండిపడ్డారు. భారతీయులు ఇందిరమ్మను ఇంకొక్క మాట అన్న ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ఒక్క రూపాయైనా రాష్ట్రానికి అదనంగా తెచ్చారా.. అన్న ప్రశ్నకు ముందుగా బండి సంజయ్ సమాధానం చెప్పాలని పొన్నం ప్రశ్నించారు.అయితే.. మొన్ననే కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు.. పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన బండి సంజయ్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొన్నం ప్రభాకర్‌తో తనకు ఎలాంటి గ్యాప్స్ లేవని.. అన్ని పోయాయన్నారు. గంగుల కమలాకర్‌తో కూడా ఎలాంటి గ్యాప్స్ లేవని.. ఉన్న చిన్న చిన్న గ్యాప్స్ కూడా పోతాయని చెప్పుకొచ్చారు. కానీ.. ఆ మాట చెప్పిన తెల్లారే.. మేయర్ సునీల్ రావు కార్పొరేటర్లను పట్టుకుని బీజేపీలో చేరిపోయారు. కాగా.. ఇప్పుడు ఎలాంటి గ్యాప్స్ లేవన్న పొన్నం ప్రభాకర్.. బండి సంజయ్‌కి వార్నింగ్ ఇవ్వటం గమనార్హం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్