వికారాబాద్: తాండూర్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి నేమురు శంకర్ గౌడ్ తరపున ప్రచారం చేసారు. ఇంద్రచౌక్ లో రోడ్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. జనసేన బిజెపికి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం… బీసీలకు రాజ్యాధికారం ఇస్తున్నందున బీసీలు సీఎం సీఎం కావాలి. బీసీల నాయకత్వం ఉన్న తెలంగాణ రావాలి. ప్రధానమంత్రి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అన్యాయం జరుగుతే తిరగబడతామని అన్నారు.

2004 నుంచి నేమొరీ శంకర్ గౌడ్ మీ ఎమ్మెల్యే అభ్యర్థి నాతో పోరాటంలో పాల్గొన్నారు. కేంద్రంలో బిజెపి సర్కార్ రావాలి. నాకు జన్మనిచ్చింది ఆంధ్ర అయినా పునర్జన్మనిచ్చింది తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంటాను. గద్దర్ అన్న మరణం నన్ను చాలా బాధించింది. శ్రీశైలంలో యురేనియం తవ్వకాలపై ఉద్యమం చేసాం. పవన్ నాగర్ కర్నూలు ప్రయాణం రద్దు చేసుకున్నారు. తాండూర్ సభ వేదిక నుంచి ప్రకటన చేసారు. నాగర్ కర్నూల్ అభ్యర్థి లక్ష్మణ్ గౌడ్ గెలిపించాలని పిలుపునిచ్చారు.



