Thursday, April 23, 2026

 సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

 సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి

Be alert for seasonal diseases

జగిత్యాల,
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలో 14 వ వార్డు స్పెషల్ డ్రైవ్ కింద మురికి కాలువలు, నాలా పనులను పరిశిలించారు.
ఈ సంధర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలంలో వాతావరణంలో చోటుచేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్‌ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యా వంటి వ్యాధులతో పాటు విషజ్వరాలు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుందని తెలిపారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.ఆరోగ్యం కాపాడుకోడానికి కాచి వడపోసిన నీటిని తీసుకోవడం మంచిదని సూచించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ పౌడర్‌తో క్లోరినేషన్‌ చేయాలన్నారు.పరిసరాలను పరిశుభ్రంగా పాటిస్తే వ్యాధులను అరికట్టవచ్చని పేర్కొన్నారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.
అధికారులు పట్టణ పరిశుభ్రత పాటించాలి.
మున్సిపల్ అధికారులు పట్టణంలోని అన్ని వార్డుల్లో డ్రైనేజీలు, ఖాళీ స్థలంలో చెత్త చెదారం, శుభ్రపరిచి  ప్లాస్టిక్ కవర్లు నివారించడానికి చర్యలు చేపట్టాలన్నారు. వీధులలో
బ్లీచింగ్, ఫాగింగ్ చేపట్టాలని, మున్సిపల్ అధికారులు సంన్వయంతో పని చేసి సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కూతురు పద్మ శేఖర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్