Sunday, May 18, 2025

మళ్లీ మంచి రోజులు వస్తాయి మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు

- Advertisement -

మళ్లీ మంచి రోజులు వస్తాయి

మేం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు రూ.10 వేలు

వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదు….అంతా చెడే

సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి రూ. 100 లాగేస్తున్నారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

గుంటూరు, ప్రధాన ప్రతినిధి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు దశా, దిశా నిర్దేశం చేసుకోవడానికి ఉగాది పండుగ ఓ వేదిక అని పేర్కొన్నారు.

మంచి రోజులు రానున్నాయనే సంకల్పం తీసుకోవాలి : తెలుగు వారికి కొత్త ఏడాది ఉగాది నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ప్రకృతికి, పండుగలకు సంబంధం ఉందన్నారు. చైత్ర మాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలని, మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు. ‘ప్రజలందరికీ ప్రగతితో పాటు సాధికారత రావాలి. ధరలు తగ్గాలి, శాంతి భధ్రతలు ఉండాలి, అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలి. సంపద సృష్టించాలి. ఆ సంపదను మంచికి ఉపయోగించాలి. ఆర్యవైశ్యులు తాము సంపాదించిన దాంట్లో కొంత భాగం బాధ్యతగా ప్రజా సేవ కోసం ఖర్చు పెడతారు. మంచి, చెడు అన్నింటిని సమానంగా చూడాలనే తత్వంతో ఉగాది పచ్చడి. వైసీపీ ప్రభుత్వంలో మంచి లేదు. అంతా చెడే. మొత్తం చేదు, కారంగానే మార్చారు. ప్రతి రోజూ ప్రజలకు ఇబ్బందులే. బకాసురుడి మాదిరి ఈ ప్రభుత్వానికి కప్పం కట్టాల్సి వస్తుంది. సంక్షేమం పేరుతో పది రూపాయలిచ్చి రూ. 100 లాగేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసే విధానాలను వైసీపీ అమలు చేస్తోంది. ఉగాది రోజున మళ్లీ మంచి రోజులు రానున్నాయనే సంకల్పం తీసుకోవాలి. ప్రజలకి అండగా ఉండేందుకే ఓ కూటమిగా వచ్చామని చంద్రబాబు చెప్పారు.

కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి : తెలుగు వారు గొప్పగా నిర్వహించుకునే పండగ ఉగాది అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కొత్త ఏడాదిలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వాలంటీర్లకు తీపికబురు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే వారికి రూ.5 వేలు కాదు, రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తాము ముందే చెప్పామని వెల్లడించారు. ప్రజలకు సేవచేస్తే తాము అండగా ఉంటామని వాలంటీర్లకు తెలిపామని వివరించారు. మన దశ, దిశ నిర్దేశించుకునే వేడుక. కొత్త ఉత్సాహం అందించే పండగ ఇది. ఉగాది సందర్భంగా కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. ఈ ఏడాదిలో సాధికారత రావాలి. నూతన సంవత్సరంలో ధరలు తగ్గాలి. సంక్షేమం ఉండాలి. ఉగాది పచ్చడిలో తీపి, వగరు, చేదు అన్నీ ఉంటాయి. ఈ ఐదేళ్లలో బకాసురుడిని మించిన పాలన సాగింది. రాష్ట్రంలో కారం, చేదు రుచులే ఉన్నాయి. అశాంతి, అభద్రతా భావం కనిపిస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం. నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వొచ్చు. సహజ వనరులన్నీ వైకాపా దోపిడీ చేసింది. తెలుగు జాతికి మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలని మనమంతా సంకల్పం తీసుకోవాలి. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి. ఇదే మన సంకల్పం అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుకు అధికార యోగం ఉంది : పంచాంగకర్త మాచిరాజు

ఈ సందర్భంగా పంచాంగకర్త మాచిరాజు వేణుగోపాల్‌ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాష్ట్రంలో త్రిమూర్తుల కలయికతో ఏపీకి మేలు జరుగుతుందని తెలిపారు. 128 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. చంద్రబాబుకు అధికార యోగం ఉందని వివరించారు. ఆయనే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతారని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్