Thursday, March 19, 2026

ప్రాణాలు తీసిన బైక్ ఇంజన్ పొగ

- Advertisement -

ప్రాణాలు తీసిన బైక్ ఇంజన్ పొగ
తిరుపతి, మార్చి 17, (వాయిస్ టుడే)

Bike engine smoke that took lives
బైక్ ఇంజిన్ నుంచి వచ్చిన పొగ వల్ల నలుగురు చనిపోయిన ఘటన   చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సాధారణంగా బైక్ ఇంజిన్ నుంచి వచ్చే పొగ ప్రాణాలను తీస్తుందని ఎవరూ ఊహించరు. అయితే, మూసి ఉన్న గదుల్లో లేదా గాలి ఆడని ప్రదేశాల్లో వాహనాన్ని ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచినప్పుడు వెలువడే వాయువులను  సైలెంట్ కిల్లర్స్  అని పిలుస్తారు. అదే నలుగురు ప్రాణాలను తీసింది.బైక్ లేదా ఏదైనా వాహన ఇంజిన్ పనిచేస్తున్నప్పుడు పెట్రోల్ అసంపూర్తిగా దహనం చెందడం వల్ల  కార్బన్ మోనాక్సైడ్  అనే విషవాయువు వెలువడుతుంది. ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండవు. అందుకే గదిలో ఈ వాయువు నిండినట్లు కూడా ఎవరూ గుర్తించలేరు. కిటికీలు, తలుపులు మూసి ఉన్న ఇరుకైన ప్రదేశంలో బోర్ వేయించిన కొత్త బైక్ ఇంజిన్‌ను పరీక్షించే క్రమంలో దానిని ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచితే, గదిలోని ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.కార్బన్ మోనాక్సైడ్ ప్రాణాపాయకరంగా మారడానికి ప్రధాన కారణం అది మన రక్తంలోని హీమోగ్లోబిన్  తో జరిపే ప్రతిచర్య. సాధారణంగా హీమోగ్లోబిన్ ఆక్సిజన్‌ను మోసుకెళ్తుంది. కానీ ఆక్సిజన్ కంటే కార్బన్ మోనాక్సైడ్ హీమోగ్లోబిన్‌తో 200 నుండి 250 రెట్లు  వేగంగా బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల రక్తంలో కార్బాక్సీహీమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఫలితంగా రక్తానికి ఆక్సిజన్‌ను శరీర భాగాలకు చేరవేసే సామర్థ్యం నశిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో  కెమికల్ యాస్ఫిక్సియేషన్ అంటారు.ఈ విషవాయువు పీల్చినప్పుడు మొదట తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే నిద్రలో ఉన్నప్పుడు లేదా మద్యం మత్తులో ఉన్నప్పుడు ఈ వాయువు శరీరంలోకి చేరితే, బాధితులు అసలు గుర్తించే లోపే స్పృహ కోల్పోతారు. మెదడు , గుండెకు ఆక్సిజన్ అందకపోవడంతో నిమిషాల వ్యవధిలోనే మరణం సంభవిస్తుంది.  పుంగనూరు ఘటనలో కూడా మూసి ఉన్న  గదిలో ఇంజిన్ పొగ నిండిపోవడం వల్లే బాధితులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా బోర్ చేయించిన వాహనాల ఇంజిన్లు సెట్ అవ్వడానికి ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచుతారు, ఇలాంటప్పుడు తప్పనిసరిగా గాలి వెలుతురు ధారాళంగా ఉండే బహిరంగ ప్రదేశాల్లోనే వాహనాన్ని ఉంచాలి. ఇలాంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఇలాంటి విషాదాలు జరుగుతుంటాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్