- Advertisement -
న్యూ ఢిల్లీలో ఉప రాష్ట్రపతికి బీఆర్ఎస్ ఎంపీల సన్మానం – డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్తో భేటీ
BRS MPs Felicitate Vice President in New Delhi – Meet with Deputy Chairman Harivansh


పార్లమెంట్ సమావేశాల అనంతరం బీఆర్ఎస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీ.పీ. రాధాకృష్ణన్ను కలుసుకొని సన్మానించారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్. సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్ రావులు గురువారం రాత్రి ఛైర్మన్ ఛాంబర్లో శాలువాతో సత్కరించారు.
అనంతరం ఈ ముగ్గురు ఎంపీలు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ను ఆయన ఛాంబర్లో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పరస్పర విషయాలపై ఇష్టాగోష్టిగా చర్చించారు.
- Advertisement -



