- Advertisement -
మహిళ దారుణహత్య
Brutal murder of a woman
తిరుపతి
అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో సింగాల గుంటలో మహిళ దారుణ హత్యకు గురయింది. మృతురాలు దాక్షాయిని (55). సింగాలగుంటలో నివాసముంటున్న తన, అక్క బావ గొడవలకు బావ తల్లి కారణమని విజయకృష్ణ అర్ధరాత్రి కత్తితో దాడిచేసాడు. గాయపడిన దాక్షాయిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న అలిపిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. దాక్షాయిని బంధువుల ఫిర్యాదు మేరకు అలిపిరి సిఐ రామకిషోర్ కేసు నమోదు చేసారు.
- Advertisement -