- Advertisement -
ప్లాష్….ప్లాష్…. ప్లాష్.. ప్లాష్
మూడు సెంటర్ లో సుమారు 30 ఫోన్ లు మాయమైనట్లు సమాచారం
ఆందోళన చెందిన విద్యార్థులు
గద్వాల్ టౌన్ లో ఎస్వీఎం, నవోదయ, సత్యసాయి డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తమ సెల్ ఫోన్ లను తమ తమ పార్కింగ్ చేసిన వాహనాలలో భద్రపరిచి పరీక్ష కేంద్రాలలోకి వెళ్లారు. ఇదే అదునుగా చూసుకొని కొందరూ ఆకతాయిలు పార్కింగ్ చేసిన వాహనాలలో ఉన్న సెల్ ఫోన్ లను ఎత్తుకెళ్లారు. విద్యార్థులు బండిలో తమ సెల్ ఫోన్ ల కోసం చూడగా అపహరణకు గురైనట్లు గ్రహించారు. దీంతో విద్యార్థులు పోలీసులను ఆశ్రయించారు.
- Advertisement -



