Sunday, September 8, 2024

కేంద్ర కేబినెట్ భేటీ మరి కాసేపట్లో….

- Advertisement -
  • మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై స్పెషల్ ఫోకస్

న్యూ ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రుల కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.  దీనిపై ఇప్పటికే ఫుల్‌ ఫోకస్‌ పెట్టిన మోడీ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు పూనుకున్నారు. దీనిపై దాదాపు వారం నుంచి కసరత్తు జరుగుతూ ఉంది. గత కొంత కాలంగా సంస్థాగత మార్పులతోపాటు సెంట్రల్ కేబినేట్ మార్పులు చేయడంపై వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాల మధ్య కేంద్ర మంత్రివర్గం- ఇవాళ ఢిల్లీలో భేటీ కాబోతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చ ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ దీనికి అధ్యక్షత వహించనున్నారు.   ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్న నేపథ్యంలో ఆయన ఫ్లైట్ ఎక్కడానికి ముందే పునర్వ్యవస్థీకరణ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శాఖల కేటాయింపుపై ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది.

central-cabinet-meeting-and-soon
central-cabinet-meeting-and-soon

అందులో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను ఆ బాధ్యతల నుంచి తప్పించి వారిని పార్టీ అవసరాల కోసం పంపించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కిషన్‌రెడ్డిని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఇప్పటికే కొందరు కేంద్ర మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. భేటీ అయినవారిలోని కొందరికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని దేశ రాజధానిలో ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి అప్పగిస్తారని సమాచారం.

అంచనాలన్నీ అనుకున్నట్టుగా జరిగితే బుధవారం లేదంటే గురువారమే కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయ్యే అవకశమున్నట్లు తెలుస్తోంది. జూలై 20న పాత పార్లమెంట్ భవనంలో ప్రారంభమై ఆగస్టు 11న ముగుస్తాయి. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం 8 నెలల సమయం మాత్రమే ఉండడంతో ఈ వర్షాకాల సమావేశాలపై చర్చించేందుకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్