Thursday, October 17, 2024

తెలంగాణ దళిత సంఘాల జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిప్పలపల్లి ఉపేందర్*

- Advertisement -

*తెలంగాణ దళిత సంఘాల జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిప్పలపల్లి ఉపేందర్*

Chippalapalli Upender* as Nalgonda District President of Telangana Dalit Associations JAC
Chippalapalli Upender* as Nalgonda District President of Telangana Dalit Associations JAC
Chippalapalli Upender* as Nalgonda District President of Telangana Dalit Associations JAC

*దళితుల సమస్యల పరిష్కారానికి కృషి: ఈదుల పరశురామ్ మాదిగ*

*త్వరలో సూర్యాపేటలో జేఏసీ 15వ వార్షికోత్సవాలు*

*ఎల్బీనగర్, వాయిస్ టుడే ప్రతినిధి:*

తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులుగా చిప్పలపల్లి ఉపేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ ఈదుల పరశురామ్ మాదిగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ లోని జేఏసీ కార్యాలయంలో జేఏసీ చైర్మన్ ఈదుల పరుశురామ్ మాదిగ మాట్లాడారు. తాము గతంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఎమ్మార్పీఎస్ సంస్థలో పనిచేశామని తెలిపారు. ఆయన స్ఫూర్తితో దళిత సంఘాలను ఐక్యం చేసి దళితుల హక్కుల సాధనకు కృషిలో భాగంగా తాము తెలంగాణ దళిత సంఘాల జేఏసీని స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆయా సమస్యలపై సంబంధిత అధికారులకు వివరించి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో దళితులు అభివృద్ధి చెందేందుకు తమ జేఏసీ ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. దళితులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ 15వ వార్షికోత్సవ వేడుకలను సూర్యాపేట పట్టణంలో త్వరలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ దళిత సంఘాల జేఏసీ 15వ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి పెద్ద ఎత్తున దళితులు, దళిత సంఘాల నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

*దళితుల సమస్యల పరిష్కారానికి కృషి: చిప్పలపల్లి ఉపేందర్*

రాష్ట్రంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని రాష్ట్ర నాయకత్వం ద్వారా అధికారులకు, ప్రభుత్వానికి విన్నవిస్తూ వారి సమస్యల పరిష్కారమే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలంగాణ దళిత సంఘాల జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు చిప్పలపల్లి ఉపేందర్ స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి తనను ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు జేఏసీ చైర్మన్ ఈదుల పరశురామ్ మాదిగ, రాష్ట్ర కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సూర్యాపేట పట్టణంలో జరగనున్న 15వ వార్షికోత్సవ వేడుకలకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి వేలాదిమంది దళితులను, దళిత సంఘాలను తరలించి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అధ్యక్షులు పర్శాల పరమేష్, జేఏసీ ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పలపల్లి నర్సయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్