సీఎం గారు మీకు మానవత్వం లేదా
జుట్టు పట్టుకుని గొడ్డులాగా బాదుతారా..?
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
CM, do you have no humanity: Union Minister Bandi Sanjay Kumar
హైదరాబాద్
అప్పులు తెచ్చి భూములమ్మితే తప్ప పాలించే పరిస్థితి లేదా
ఆ మాత్రానికి మీరెందుకు
కేఏ పాల్ కు అప్పగించినా అదే పనిచేస్తారు కదా,
ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది
వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి,
హెచ్ సీయూ ఘటనపై తక్షణమే విచారణ జరపాలి
బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
సన్నబియ్యం కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఏది?
రేషన్ బియ్యం ఖర్చులో రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేసేది కేంద్రమే
రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2 వేల కోట్లు మాత్రమే,
కిలోకు రూ.40లు చెల్లిస్తోంది మేమే
మీరు భరించేది కిలోకు రూ.10 మాత్రమే,
ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గొప్పదా రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా,
అయినా కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు.
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనయ్
మజ్లిస్ ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు.
ఈ మూడు పార్టీల కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలి
100 శాతం బీజేపీ పోటీ చేయాలన్నదే ఆలోచన త్వరలోనే పార్టీ నిర్ణయం ప్రకటిస్తుంది.
గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల్లో అభ్యంతరాలున్నాయి
వెంటనే న్యాయ విచారణ జరపండి
మెరిట్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నదే బీజేపీ డిమాండ్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్:
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు. కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా అంటూ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఆయనేమన్నారంటే.
అందరికీ ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీ చూసి బాధపడని వాళ్లు లేరు. ప్రతి ఒక్కరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేనట్లుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా, అమ్మాయిలని చూడకుండా జుట్టు పట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా ఇదేం పద్దతి, భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా, ఈనెల జీతాలివ్వాలంటే భూములు అమ్మాల్సిందేనా, భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా ఇదేం పాలన,
ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా, రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మొత్తం ఘటనపై విచారణ జరపాలి. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది, వాళ్లంతా విద్య గురించి మాట్లాడేవాళ్లు కదా, కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా, మరి వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి. వేల కోట్లకు భూములమ్మితే మీకు కూడా కమీషన్లు వస్తున్నాయని మౌనంగా ఉన్నారా స్పష్టం చేయాలి.
అసలు వర్శిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏంది అమ్మడానికి మీరెవరు, అభివ్రుద్ధి పేరుతో భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు, కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా మరి అప్పులు తెచ్చి, భూములు అమ్మి, ప్రజల ఆస్తులను అమ్ముతామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు, చెబితే ఒక్క ఓటు కూడా పడకపోయేది కదా? అందుకే హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.
మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.