Friday, October 18, 2024

పుట్టపర్తి జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం జగన్

- Advertisement -

అమరావతి:నవంబర్ 07: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గడిచిన అయిదేళ్ళుగా అమలు చేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం నిధులను ప్రభుత్వం నేడు మంగళవారం అందచేయనుంది.  శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధికసాయాన్ని జమ చేయనున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 53.53 లక్షల మంది రైతులకు రూ 4 వేల చొప్పున మొత్తం రూ.2,204.77 కోట్లను అందచేయనున్నారు. ఏడాదికి మూడు విడతలుగా రైతులకు రూ 13,500 లను ప్రభుత్వం అందచేస్తోంది. దీనిలో రూ 6 వేలను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ పథకం కింద అందచేస్తుండగా మిగతా రూ 7,500 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ-క్రాప్‌, ఈ-కేవైసీ ఆధారంగా రూపొందించిన వెబ్‌ ల్యాండ్‌ ఆధారంగా వ్యవసాయం చేస్తున్న భూమి యజమానులతో పాటు పంట సాగు హక్కు పత్రాలున్న దేవాదాయ, అటవీ, ఇతర అర్హులైన ఎస్‌.సీ, ఎస్‌.టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు కూడా ప్రభుత్వం పెట్టు-బడి సాయం కింద రైతు భరోసా పథకాన్ని అందచేస్తోంది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్