ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
* పాఠ్యపుస్తకాల్లో జయ జయహే తెలంగాణ గీతాన్ని చేరుస్తాం
* అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
* పాడె మోసి అందెశ్రీకి అంతిమ వీడ్కోలు పల్కిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్/ఘట్ కేసర్ నవంబర్ 11
* CM Revanth Reddy bids farewell to Pade Mosi Andesri
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. అందెశ్రీ అంత్యక్రియల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పాడె మోసి అందెశ్రీకి అంతిమ వీడ్కోలు పలికారు. ఘట్ కేసర్ లో సిఎం మాట్లాడుతూ.. అందెశ్రీ తో గతంలో అనేక విషయాలు చర్చించామని తెలిపారు. జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా నిర్ణయించామని, జయ జయహే తెలంగాణ గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామని తెలియజేశారు. అందెశ్రీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడు.. అందెశ్రీ అని.. రేవంత్ రెడ్డి కొనియాడారు.


