ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్…
ఈ క్రమంలోనే బయటికి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం:సిఎం రేవంత్ రెడ్డి
న్యూ డిల్లీ మే 28
ఫోన్ ట్యాపింగ్పైనా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార మార్పిడి తర్వాత చోటు చేసుకున్న అధికారుల బదిలీల్లో ఎస్ఐబీ కార్యాలయంలో కొన్ని వస్తువులు మిస్ అయినట్లు గుర్తించారని, ఈ క్రమంలోనే ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చిందని తెలిపారు. ట్యాపింగ్ వ్యవహారంపై ఇప్పటి వరకు సమీక్ష జరపలేదన్న రేవంత్ రెడ్డి, అధికారులు వారి పని వారు చేసుకుంటూ పోతున్నారని చెప్పారు. పోలీసుల పనిలో జోక్యం చేసుకుంటే ఏం జరుగుతుందో తనకు తెలుసునన్నారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు, ఫోన్ ట్యాపింగ్పై ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ లాంటి కార్యకలాపాలు తమ ప్రభుత్వం చేయదని ముఖ్యమంత్రి చెప్పారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరగొచ్చని, అందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎస్ఐబీ అధికారులు కేంద్ర నిఘా సంస్థలతోనే నేరుగా మాట్లాడతారు తప్ప, తనతో కాదన్నారు. 1980, 90ల నుంచి సేకరించిన డేటా అంతా ఉందో లేదో? బ్యాకప్ కూడా ఉందో లేదా దాన్ని కూడా మాయం చేశారో అంతా దర్యాప్తు అధికారులకు తెలుస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు
ఫోన్ ట్యాపింగ్పైనా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -