- Advertisement -
జమ్మికుంటలో సిసిఐ పత్తికొనుగోళ్లు ప్రారంభం
Commencement of CCI cotton procurement in Jammikunta
జమ్మికుంట
ఉత్తర తెలంగాణ లోని రెండవ అతి పెద్ద మార్కెట్ అయినా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్ లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిసిఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. దీంతో రైతులు భారీగా పత్తిని మార్కెట్ కు తరలించారు. కొనుగోళ్లు ప్రారంభించిన మొదటి రోజే 2200 క్వింటాళ్ల పత్తినీ రైతులు మార్కేట్ కు తీసుకువచ్చారు.పత్తి లో తేమ శాతం 8 నుండి 12 శాతం వరకు వచ్చేలా పత్తి నీ మార్కెట్ కు తీసుకువస్తే రైతులకు మద్దతు ధర చెల్లిస్తామని.కొన్ని రోజులుగా వర్షాలు ఉన్న నేపథ్యం లో రైతులు పత్తిని ఆరబెట్టి మార్కెట్ కు తీసుకురావాలని కోరారు. జమ్మికుంట పట్టణం లో ఏడు జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేశామని రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దని కోరారు.
- Advertisement -



