బిజెపి కార్యకర్తలపై దాడులు, హత్యలు జరిగినా పార్టీ సిద్ధాంతాన్ని, దేశభక్తిని ఎప్పటికీ వదల్లేదు
మునిసిపల్ ఎన్నికల్లో విశ్వాసాన్ని నిలబెట్టిన ప్రతి కార్యకర్తకు అభినందనలు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026లో రాంచందర్ రావు
హైదరాబాద్ ఫిబ్రవరి 17
Congratulations to every worker who reposed faith in the municipal elections: Ramchandra Rao
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 రాష్ట్ర స్థాయి కార్యశాల ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారి అధ్యక్షతన విజయవంతంగా జరిగింది. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తకు శిక్షణ అందించే అతి పెద్ద రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఈ కార్యశాల జరిగింది.ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలపై నాయకులు, కార్యకర్తలకు లోతైన అవగాహన కల్పించడంతో పాటు, దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే, సైద్ధాంతిక సాధికారతను పెంపొందిస్తూ, సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికలను సవివరంగా వివరించారు.ఈ కార్యశాలలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ , పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్ , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు , వీరేందర్ గౌడ్ గారు, వేముల అశోక్ , రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు , సీనియర్ నాయకులు అమర్ నాథ్ సారంగుల , రాష్ట్ర పదాధికారులు, బిజెపి జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, తదితులు పాల్గొన్నారు. ee సందర్బంగా రామ చంద్రా రావు మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్-2026 నిర్వహించబడుతోందని తెలంగాణలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమన్నారు..ఈ ఎన్నికల ఫలితాల్లో చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ వంటి కీలక పదవులన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను సాధించడం గర్వకారణమని, అలాగే నారాయణపేటలో చైర్ పర్సన్ పదవిని సాధించిన మన పార్టీ నాయకులు ఎంతో కష్టపడి ఆ బాధ్యతను గెలుచుకున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు..ఇక దేశమంతా దృష్టి సారించిన భైంసాలో ఇన్నాళ్లు “ఇది మా గడ్డ” అని చెప్పుకున్న వారి అహంకారాన్ని బద్దలుకొట్టి, భారతీయ జనతా పార్టీ అక్కడ విజయపతాకాన్ని ఎగరవేయడం చారిత్రాత్మక విజయం. ఆ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నానన్నారు..ఇంతటి



