Sunday, January 25, 2026

ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ 102వ ఆవిర్భావ దినోత్సవం

- Advertisement -

ఘనంగా కాంగ్రెస్ సేవాదళ్ 102వ ఆవిర్భావ దినోత్సవం
గాంధీభవన్ నుంచి సెక్రటేరియట్ వరకు భారీ ర్యాలీ

Congress Seva Dal celebrates its 102nd foundation day

హైదరాబాద్, డిసెంబర్ —వాయిస్ టుడే
అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ 102వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి సెక్రటేరియట్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ, 102 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ సేవాదళ్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. 1923లో స్థాపితమైన కాంగ్రెస్ సేవాదళ్‌కు స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించడం గర్వకారణమని అన్నారు.

స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ ఒక సాధారణ విభాగం కాదని, లాఠీచార్జీలు, కారాగార జీవితం, త్యాగాలతో దేశానికి అంకితమైన పోరాట దళంగా నిలిచిందని గుర్తు చేశారు. గాంధీ చూపిన అహింసా మార్గం, నెహ్రూ ప్రతిపాదించిన లౌకిక దృక్పథం, రాజ్యాంగ విలువల పరిరక్షణే సేవాదళ్ మూల సిద్ధాంతాలుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

102వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకికత్వం, రాజ్యాంగ విలువల కోసం కాంగ్రెస్ సేవాదళ్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుందన్న స్పష్టమైన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు.

సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం, దేశాన్ని ఆధునిక దిశగా నడిపించిన ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఐటీ విప్లవం, పంచాయతీ రాజ్ బలోపేతం, యువతకు అవకాశాల కల్పన వంటి సంస్కరణలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగం పెరుగుతోందని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జితేందర్ విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ సేవాదళ్ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే సేవాదళ్ ప్రధాన లక్ష్యమని, యువత, మహిళలను పెద్ద సంఖ్యలో సేవాదళ్‌లోకి తీసుకువచ్చి “ప్రజాసేవే రాజకీయము” అన్న భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ప్రతి సేవాదళ్ కార్యకర్త క్రమశిక్షణ, త్యాగం, సేవాభావంతో పనిచేసి కాంగ్రెస్ జెండాను ప్రజల మధ్య గర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు సహా జిల్లాల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్