కాపీ కింగ్…. ఎవరు…

- Advertisement -

హైదరాబాద్, అక్టోబరు 17, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ- కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య మేనిఫెస్టోలపై మాటల యుద్ధం జరుగుతోంది. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలనే కాస్త అటూ ఇటూ మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, ఆరు గ్యారంటీల అమలు సాధ్యమేనా అని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ఇప్పుడు వాటినే అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా రాజముద్ర వేసినట్లైందంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలతో బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందంటూ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందని .. తాము ప్రకటించిన 6 గ్యారంటీలనే కొద్దిగా మార్చి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించిందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను తెలంగాణ ప్రజలు నమ్మబోరని,

Copy King….who…
Copy King….who…

బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అమలు చేయలేని హామీలు చేర్చారన్నారు. తామిచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాక్యానించారు. తమ మేనిఫెస్టోనే కాంగ్రెస్‌ కాపీ కొట్టిందని బీఆర్‌ఎస్‌ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తమ మేనిఫెస్టో చూసి ప్రతిపక్ష నేతల గుండెలు జారిపోయాయంటూ మంత్రి హరీశ్‌ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీష్ రావు వివరించారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాల పేర్లను మార్చి ఆరు గ్యారంటీలంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్‌దేనని, తెలంగాణపై స్పష్టమైన అవగాహన లేనీది వారికేనంటూ మండిపడ్డారు. కాంగ్రెస్సే కాదు, బీజేపీ కూడా తమ పథకాలు కాపీకొట్టిందంటూ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.ఇలా.. మేనిఫెస్టోల రగడ.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా మేనిఫెస్టోలపై కాపీ ఆరోపణల యుద్ధం మరికొంతకాలం కొనసాగే అవకాశముంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular