- Advertisement -
జాతీయ ఓటర్ల దినోత్సవం
ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన సీఎస్
హైదరాబాద్
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సచివాలయంలోని ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు ఓటు వినియోగాన్ని విధిగా పరిగణించడానికి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవంలో పలువురు సీనియర్ ఐఏస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.
- Advertisement -



