Friday, February 27, 2026

ఎన్నికల కోసం కూతురు బలి

- Advertisement -

ఎన్నికల కోసం కూతురు బలి
నిజామాబాద్, ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే )

Daughter sacrificed for election
అధికారంపై వ్యామోహం మనిషిలోని మానవత్వాన్ని చంపేయడమే కాదు, కన్న కూతురినే బలి తీసుకునేలా ప్రేరేపించిన కిరాతక ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. కేవలం సర్పంచ్ పదవికి అనర్హుడు

కాకూడదనే స్వార్థంతో, ఒక తండ్రి పక్కా స్కెచ్‌తో తన  కూతురిని ప్రాణాలతో కాలువలోకి తోసి హత్య చేసిన వైనం  సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి రాజకీయాల్లో ఎదగాలనే

బలమైన కోరిక ఉంది. గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయలని అనుకుంటున్నాడు.  అయితే, అక్కడి ముగ్గురు పిల్లల నిబంధన అతనికి అడ్డుగా మారింది. ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి అతను ఎంచుకున్న మార్గం

అత్యంత హేయమైనది. తన ముగ్గురు సంతానంలో ఒకరు తగ్గిపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఉద్దేశంతో, ప్రస్తుత సర్పంచ్ గణేష్‌తో కలిసి క్రిమినల్ కుట్ర పన్నాడు. పక్కా వ్యూహం ప్రకారం, తన పెద్ద కూతురు

ప్రాచీని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి సమీపంలోని నిజాం సాగర్ కెనాల్ వద్దకు తీసుకువచ్చాడుసాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్న పాండురంగ, పన్నెండేళ్ల ఆ బాలిక తనను

కాపాడమని ప్రాధేయపడుతున్నా కనికరం లేకుండా ప్రవహిస్తున్న కెనాల్‌లోకి తోసేశాడు. బతికి ఉండగానే నీటిలోకి నెట్టడంతో, ఆ చిన్నారి ఊపిరి ఆడక జలసమాధి అయింది. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన

మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, పోలీసుల నిశిత దర్యాప్తులో అసలు  మోటివ్ బయటపడింది.  కెనాల్‌లో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం కేసును ఛేదించేందుకు పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని

వినియోగిచారు.  ఘటనా స్థలంలో నిందితుల మొబైల్ సిగ్నల్స్, సరిహద్దు ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. లోతైన విచారణలో పాండురంగ తన నేరాన్ని అంగీకరించాడు.

కేవలం రాజకీయ పదవి కోసం కన్న కూతురిని అంతం చేయడమనే ఈ క్రూరమైన చర్య పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది.  ఈ కేసులో ప్రధాన నిందితుడు పాండురంగతో పాటు, హత్యకు ప్రేరేపించి

సహకరించిన కేరూరు సర్పంచ్ గణేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీలోని హత్య, కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అధికారం కోసం పన్నెండేళ్ల బాలిక ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటన రెండు

రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. స్వార్థం కోసం కన్నపేగును తెంచుకున్న ఈ తండ్రికి కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.జామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్‌పీ క్యాంప్ నిజాం సాగర్

శివారులోనీ డి 46/8 కెనాల్‌లో దొరికిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలిక మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండు రంగ అనే వ్యక్తి కుమార్తె అని

గుర్తించారు. మహారాష్ట్రలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండొద్దు అనే నిబంధన ఉండటంతో ఎలాగైనా ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్న పాండు రంగ..

ఊహించని నిర్ణయం తీసుకున్నాడు.సర్పంచ్ పోటీకి అనర్హుడిగా మారానని తన మిత్రుడు ప్రస్తుత కేరూర్ గ్రామ సర్పంచ్‌తో చెప్పడంతో అతడు ఈ సలహా ఇచ్చాడు. తన ఫ్రెండ్ సలహాతోనే తన పెద్ద కుమార్తెను హత్య

చేసినట్లు పోలీసుల విచారణలో హంతకుడు పాండురంగ వెల్లడించాడు. దీంతో హత్య చేసిన పాండు రంగ, సలహా ఇచ్చిన గ్రామ సర్పంచ్ గణేష్ షిండేను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.ఎన్నికల్లో

సర్పంచ్‌గా పోటీ చేయాలని.. తన పెద్ద కుమార్తె ప్రాచీని.. ఎడపల్లికి తీసుకొచ్చి ప్రాణాలతో ఉండగానే కెనాల్‌లోకి తోసి హత్య చేసినట్లు ఆమె తండ్రి పాండు రంగ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇక నీటి ప్రవాహంలో

కొట్టుకుపోయిన ఆ బాలిక.. ఊపిరి ఆడక మృతి చెందింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్