Sunday, September 8, 2024

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి క్లారిటీ

- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగుతుంది. పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశానన్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ, జనసేన శ్రేణులు ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు

did-not-make-inappropriate-comments-on-pawan-kalyan-kishan-reddy-clarity
did-not-make-inappropriate-comments-on-pawan-kalyan-kishan-reddy-clarity

కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటన

అందరికీ నమస్కారం,

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంలో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ నిర్ణయం రెండు పార్టీలు ఆలోచించి తీసుకున్నదే. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్నందునే మేము.. జనసేనతో కలిసి బరిలో దిగాం.

అయితే, ఆదివారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కొందరు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నేను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారు.

ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్