Wednesday, February 4, 2026

అంబటి వ్యాఖ్యలపై చర్చ…

- Advertisement -

అంబటి వ్యాఖ్యలపై చర్చ…
గుంటూరు ఫిబ్రవరి 3, (వాయిస్ టుడే )

Discussion on Ambati’s comments…
వైసీపీ  సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇటీవల నడిరోడ్డుపై మీడియా ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. సభ్యసమాజం ఆమోదించలేని పదజాలంతో చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. అధికారంలో ఉన్న సమయంలో ఇదే తరహా వ్యాఖ్యలు టీడీపీ  నేతల నుంచి వచ్చి ఉంటే ఎలా స్పందించేవారు అన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి  జగన్ మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అర్థరాత్రి అరెస్ట్ జరిగిన ఉదంతాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆ సందర్భాన్ని ఇప్పుడు అంబటి వ్యవహారంతో పోలుస్తూ, చట్టం అందరికీ సమానంగా వర్తించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అంబటి వ్యాఖ్యలను సమర్థించే పరిస్థితి వైసీపీలోనే కనిపించడం లేదు. పార్టీ అధినేత తప్ప ఇతర నాయకులు బహిరంగంగా మద్దతు పలకకపోవడం గమనార్హం.వైసీపీలోని పలువురు నేతలు ఆఫ్ ది రికార్డ్‌గా మాట్లాడుతూ, అంబటి మాట తీరు ఎప్పటి నుంచో ఇలాగే ఉందని, గతంలో కూడా అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కొందరు నేతలు ఆయన ప్రవర్తన పార్టీకి నష్టం కలిగిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో అంబటి వ్యవహారం వ్యక్తిగత అంశం కాదని, పార్టీ అంతర్గత సమస్యల ప్రతిబింబంగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది.అసలు అంబటి ఈ స్థాయిలో స్పందించడానికి కారణాలేంటి అన్నది మరో కీలక అంశంగా మారింది. బహిరంగంగా చెబుతున్నట్లు టీడీపీ శ్రేణులు ఆయన కారును అడ్డుకోవడమే కారణం కాదని, వైసీపీలోని కొందరు నాయకులే అంటున్నారు. ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నుంచి అంబటిని తప్పించడంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గిందనే భావన పెరిగిందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయనపై కేసులు నమోదవడం, పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా అసంతృప్తికి కారణమైందని అంటున్నారు.ఈ అన్ని అంశాల సమ్మేళనమే అంబటి కోపంగా బయటపడడానికి దారితీసిందని రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందని, వైసీపీలో అంతర్గత అసంతృప్తి బయటకు వస్తోందనే చర్చ జరుగుతోంది. ఒక్క అంబటే కాకుండా మరికొందరు నాయకులు కూడా ఇదే తరహా ఆగ్రహంతో ఉన్నప్పటికీ, కొందరు సంయమనం పాటిస్తుండగా మరికొందరు బహిరంగంగా స్పందిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామాలు వైసీపీ భవిష్యత్ రాజకీయ దిశపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్