- Advertisement -
ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎల్పిఓ సతీష్ కుమార్
DLPO Satish Kumar who conducted a surprise inspection of Indiramma's house surveyమంథని
మంథని మండలంలోని రచ్చపల్లి, గోపాల్ పూర్ గ్రామలలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బుధవారం మంథని డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించి సర్వే పనితీరును తనిఖీ చేశారు. రోజుకి 40 ఇండ్లు తగ్గకుండా సర్వే చెయ్యాలని అధికారులకు సూచించారు, అలాగే సర్వే జరుగుతున్నా క్రమంలోనే 100 శాతం ఇంటి పన్నులు వసూలు చెయ్యాలని ఆదేశించారు. వారి వెంట సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -




