కాంగ్రెస్‌, బీజేపీ మాయ మాటలు నమ్మొద్దు

- Advertisement -

మంత్రి గంగుల కమలాకర్

బీజేపీ,కాంగ్రెస్‌ నాయకులు చెప్పే మాయమాటలకు ప్రజలు మోసపోయి గోసపడొద్దని కరీంనగర్ బారసా ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్  అన్నారు…   మంగళవారం పద్మనాయక మినీ కళ్యాణమండపంలో నాయి బ్రాహ్మణ,వడ్డెర సంఘం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై మాట్లాడారు..

ఈ సందర్భంగా మంత్రికంగా కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా పని చేస్తున్నానని ప్రతీ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధ్ది పనులు చేశానని అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఏదో రకంగా ప్రభుత్వ సంక్షేమం అందుతుందని అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి హ్యాట్రిక్‌ సీఎంగా కేసీ ఆర్‌ను,నాల్గొ సారి తనను ఎమ్మెల్యేగా తెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు… బారాసా నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వడ్ర సంఘం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular