Sunday, February 22, 2026

బయిటకు రావద్దు… రోగాలు వస్తాయి…

- Advertisement -

న్యూఢిల్లీ, నవంబర్ (వాయిస్ టుడే ): సూచిస్తున్నారు. రానురాను వాయు నాణ్యత ఇంకా పడిపోయే ప్రమాదముందని వివరిస్తున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యంపై ఈ కాలుష్యం తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. “ప్రస్తుతం ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చెప్పాలంటే రాజధాని నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్తే కళ్లు మండుతాయి. గొంతు నొప్పి మొదలవుతుంది. ఇప్పటికే హాస్పిటల్స్‌లో ఓపీ డిపార్ట్‌మెంట్‌లో పేషెంట్స్ సంఖ్య 20-30% మేర పెరిగింది. ఈ విషవాయువు శరీరంలోకి వెళ్తే ప్రతి అవయవంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. కానీ పని చేయాలంటే బయటకు వెళ్లక తప్పదు. అందుకే…బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోండి. నీళ్లు ఎక్కువగా తాగండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి”

– డా. సందీప్ నాయర్, వైద్య నిపుణులు

ఢిల్లీలో ఈ పరిస్థితి రావడానికి ఆప్ సర్కార్ వైఫల్యమే కారణమని బీజేపీ నేతలు మండి పడుతున్నారు. షెహజాద్ పూనావాలా ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్‌ లేకుండా బయటకు వచ్చే పరిస్థితే లేకుండా చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా కేజ్రీవాల్ ప్రభుత్వం కాలుష్యం తగ్గించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ప్రతిసారీ పంజాబ్‌పై తప్పు నెట్టేస్తున్నారని, ఇప్పుడక్కడ ఆప్ ప్రభుత్వమే ఉన్నా సమస్యని పరిష్కరించలేదని విమర్శించారు.అయితే ఈ విమర్శలపై ఆప్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో డీజిల్ జనరేటర్‌లు బ్యాన్ చేశామని గుర్తు చేస్తున్నారు. CNG,ఎలక్ట్రిక్ బస్‌ల సంఖ్య పెంచామని వివరిస్తున్నారు. యూపీ, హరియాణాలో ఎలక్ట్రిక్ బస్‌లు ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్