Thursday, March 26, 2026

అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దు.. జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

- Advertisement -
అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దు..
జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ
Don't give old cell phones to strangers.
District Police Commissioner Dr. B. Anuradha

సిద్దిపేట
ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ.  అజ్ఞాత వ్యక్తులు ఎవరైన పాత మొబైల్స్ లేదా పాడైన మొబైల్స్ కొంటాం అంటూ మీ దగ్గరికి వస్తె అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరస్తులు  సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 4000 మొబైల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే వాటిని సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందని, డివైజ్ ఐడెంటిటీ కారణంగా అమ్మకందారులు కూడా నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అమ్మినచో అమ్మకందారులు కూడా నేరస్తులుగా  పరిగణించబడుతారు అని తెలియచేసారు.
ఇటువంటి సైబర్ కేటుగాళ్ల ముఠాల వల్ల అమాయక ప్రజలు తమ కష్టార్జితం ద్వారా సంపాదించిన డబ్బును కోల్పోతున్నారని కావున ప్రజలు తమ పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని సైబర్ నేరాలకు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్