తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు ప్రారంభం

- Advertisement -
Double decker bus services start in Tirupati
Double decker bus services start in Tirupati

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు.

నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.

ఈ బస్సులో తిరుపతికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రయాణించారు.

ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత మాట్లాడుతూ.. తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులతో పాటు స్థానికులకు డబుల్ డెక్కర్ బస్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఈ బస్సులో ప్రయాణించే వారికి సరికొత్త అనుభూతి లభిస్తోందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నగరపాలక సంస్థ పరిధిలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు ప్రారంభించినట్లు చెప్పారు.

Double decker bus services start in Tirupati
Double decker bus services start in Tirupati
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular