ఈ రోజు బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ మసీదు దగ్గర ఉన్న, డా. బీఆర్ అంబేద్కర్ కూడలిలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, యువ జన నాయకులు ఆదిల్ పటేల్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ,
బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆశ జ్యోతి అయ్యి, వారి శ్రేయస్సు కోసం ముందుకు వచ్చి కొట్లాడిన వ్యక్తి డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు. అత్యంత శక్తివంతమైన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి, న్యాయ నిపుణుడిగా ప్రఖ్యాతి గాంచి, దేశ మూల స్థంభమైన ఆర్ధిక వ్యవస్థకు ఆర్ధిక నిపుణుడై, బహుముఖ ప్రజ్ఞశాలియై, పేరు గాంచిన గొప్ప సంఘ సంస్కర్త బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేద్కర్ అని అన్నారు.అణగారిన వర్గాలకు, వెనుకబడిన దళిత వర్గాలకు చేయూత అందించి వారికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించిన గొప్ప దార్శనికుడు డా. బీఆర్ అంబేద్కర్ అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.

కార్పొరేటర్ హమీద్ పటేల్ తో బాటుగా కొండాపూర్ డివిజన్ యువ జన నాయకులు ఆదిల్ పటేల్, సీనియర్ నాయకులు సిద్ధిక్ నగర్ బస్తీ అధ్యక్షులు కాలే బసవ రాజు, నందు, నరసింహ సాగర్, బుడుగు తిరుపతి రెడ్డి, గణపతి, చారీ, విక్రమ్, రవి శంకర్ నాయక్, విజయ్, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, తిరుపతి యాదవ్, డా. సుదర్శన్, పూజ, మణెమ్మ, కచ్చావా దీపక్, జుబెర్, అమీర్, దుర్గ ప్రసాద్, నయీమ్, దిలీప్, లక్ష్మి బాయి తదితరులు పాల్గొన్నారు.



