సూర్యాపేట. సాగర్ ఎడమ కాలువ ద్వారా ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు త్రాగునీరు ,ఐదు క్యూసెక్కులు, విడుదల చేయడంతో , నల్లగొండ ,సూర్యాపేట జిల్లాలో ఉన్న మేజర్ల వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,పోలీస్లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల,పోలీస్ పహారాతో పాలేరు కు త్రాగునీటి కోసం నాగార్జునసాగర్ సాగర్ నీరు పోలీస్ ప హర మధ్యన కొనసాగుతుంది. కాలువపై ఉన్న ట్రాన్స్ఫార్మర్లుకు, సరఫరా నిలిపివేసి ,కరెంటు మోటర్లుకి , కరెంటు సరఫరా నిలిపివేసి ఖమ్మం జిల్లాకు నీరు తరలిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న చెరువులు ,కుంటలు నింపి త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని, ఒక్క జిల్లాలోనే త్రాగునీటి సమస్య లేదని, అన్ని జిల్లాల్లో నీటి సమస్య ఉన్నందున, త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.



