Monday, February 16, 2026

టీఎస్ ఆర్టీసీకి  కోట్ల ఆదాయం తెచ్చి పెట్టిన దసరా..

- Advertisement -

తెలంగాణలో దసరా పండుగ ధూం ధాంగా జరిగింది. టీఎస్ ఆర్టీసీకి ఈ దసరా పండుగ కోట్ల వర్షం కురిపించింది. దసరా పండుగ వేళ టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.

కేవలం 11 రోజుల్లోనే.. ఆర్టీసీ ఖాజానాలో సుమారు రూ.25 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. పండుగను పుసర్కరించుకుని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్‌ ఆర్టీసీ నడిపించింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు నగరంలోని అన్ని పికప్ పాయింట్ల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. అయితే.. ఈసారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది టీఎస్ ఆర్టీసీ.

అయితే.. ఈసారి డైనమిక్‌ ఛార్జీలను కూడా టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలోనే డైనమిక్‌ ఛార్జీలు వసూలు చేసినప్పటికీ.. పండుగ వేళ అవి ఆర్టీసీకి కలిసొచ్చాయి. విశాఖపట్టణం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు డైనమిక్ ఫేర్‌ను ఎక్కువగా వినియోగించుకుంటున్నారుప్రైవేట్ ట్రావెల్స్‌తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు తక్కువగా ఉండడంతో జనాలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇక పండుగ సందర్బంగా.. అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులను నడిపించింది. తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. కాగా.. సాధారణంగా రోజూ ఆర్టీసీకి సుమారు 12 నుంచి 13 కోట్ల ఆదాయం సమకూరగా… దసరా పండుగకు మాత్రం ప్రతిరోజూ అదనంగా 2 నుంచి 3 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

అత్యధికంగా ఒక రోజు 19 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలా.. ఆర్టీసీకి గత 11 రోజుల్లోనే 25 కోట్లకు పైగా అదనపు ఆదాయం వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఒక్కో రీజియన్‌కు సరాసరిగా సుమారు 2 కోట్ల నుంచి రెండున్నర కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్