పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అలపాటి రాజా ఎన్నికల నామినేషన్
Election nomination of graduate MLC candidate Alapati Raja
పిడుగురాళ్ల నుండి భారీగా తరలి వెళ్లిన కూటమి నాయకులు
పిడుగురాళ్ల,
కృష్ణ,గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జిపి రెడ్డి గ్రూప్ స్కాలర్స్ జూనియర్ కాలేజీ యాజమాన్యం పిడుగురాళ్ల స్కాలర్స్ డైరెక్టర్స్ జి,శ్రీనివాసరెడ్డి ఎం,జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి,బలపరిచిన అభ్యర్థి మాజీ మంత్రి,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,ఆలపాటి రాజా కి సంఘీభావం తెలియజేస్తూ పిడుగురాళ్ల జిపి రెడ్డి స్కాలర్స్ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో 20 కారులతో ర్యాలీగా నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పట్టణ అధ్యక్షులు పాండురంగ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డవల్లి సర్వేశ్వరరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖాసిం, బీసీ సెల్ అధ్యక్షులు వల్లెపు రామకృష్ణ, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సైదా, రాష్ట్ర టీడీపీ కుమ్మర శాలివాహన సాధికార సమితి నాయకులు నడికుడి వెంకటేశ్వరావు, 6వ వార్డు ఇంచార్జి బిజ్జిలి వెంకట్రావు,12వ వార్డు ఇంచార్జి మొగిలి ఏడుకొండలరావు,16వ వార్డు ఇంచార్జి జమ్మిశెట్టి రామకృష్ణ, 20వ వార్డు ఇంచార్జి గోళ్ళ కిరణ్ కుమార్, 5వ వార్డు ఐటీడీపి కోఆర్డినేటర్ చాట్ల సునీల్, గంగయ్య, దూదేకుల ఖాసీం, స్కాలర్స్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, పట్టభద్రులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు జండాలు ఊపి నామినేషన్ కి ర్యాలీగా వెళ్తున్న కార్లను ప్రారంభించారు.



