నేడు గజ్వేల్‌కు ఈటల రాజేందర్

- Advertisement -

గజ్వేల్‌లో నేడు బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించనున్నారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే ఈటల సెగ్మెంట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

ఇక ఈటలకు స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ టెంపుల్ వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటల పాల్గొంటారు.

అనంతరం ముట్రాజ్ పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈటల పాల్గొననున్నారు. ఈటల సమక్షంలో పలువురు బీఆర్ఎస్ అంసతృప్త లీడర్లు, గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

ఈ సీఎం కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తుండగా, ఈటల హుజురాబాద్ తో పాటు, గజ్వేల్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య పోటీ ఉండటంతో ఈ స్థానంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఈటల రాజేందర్ గెలుపుపై ధీమాగా ఉండగా.. కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని ఈటల అంటున్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular