Sunday, September 8, 2024

బుచ్చి రూపు రేఖలు మార్చాను…

- Advertisement -

బుచ్చి రూపు రేఖలు మార్చాను…
చంద్రబాబు 5000 ఇస్తారంట.

తీసుకోండి ఫ్యాన్ గుర్తుకు ఓటు  చేయండి..

ప్రతి విద్యార్థి,విద్యార్థును లు ఇంగ్లీష్ చదవాలి..జగన్ ఆశయం..

33 పథకాలు రెండు లక్షల 75 వేల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లోకి…

జగన్ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు..

ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి..

బుచ్చిరెడ్డిపాలెం.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి  నిరూపించుకున్న ఏకైక ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం  హై స్కూల్ నందు  ఎనిమిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్లు గురువారం ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ఎక్కడ జగన్మోహన్ రెడ్డి  చిరస్థాయిగా నిలిచిపోతారేమో మా మామయ్య జగన్ అని చెప్పుకుంటారేమోనని భయం వీళ్లకు పట్టుకుని ఎందుకు చెడిపోతారు ఇంగ్లీష్ మీడియం చదవకూడదు వాళ్ళ కుటుంబాలు మాత్రమే వాడాలి ఇంతకన్నా అన్యాయం ఇంకొక కుటుంబాన్ని అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికం నిర్మూలించి అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,అని తెలిపారు. చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాడు,, ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేశాడు ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ ఇవ్వలేదు ఒక జగన్మోహన్ రెడ్డి  కూడా డబ్బులు అడగలేదు ఇన్ని పథకాలు పెట్టమని అడగలేదు జగన్మోహన్ రెడ్డి ని 33 పథకాలు పెట్టి దాదాపు రెండు లక్షల 75 వేల కోట్లు మీకు నేరుగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేశారు. నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయని ఎప్పుడో కనిపించని తెలుగుదేశం పార్టీ నాయకులు మిగతా పార్టీల నాయకులంతా కూడా రకరకాల చొక్కాలు వేసుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు,మేము ఉద్దరిస్తాము మాకు ఓట్లు ఎయ్యండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ మనస్సాక్షి వదిలేస్తున్నానుఅని తెలిపారు. మీ గుండె మీద చేయి వేసుకొని ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి ఒక చర్చ పెట్టండి ఎవరు మనకు చేశారు,ఎవరు మన మధ్య ఉన్నారు, ఈ నాలుగున్నర సంవత్సరాల లో జగన్  ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు ఎవరు ఇచ్చారు,అని చర్చి మీ కుటుంబాల్లో జరగాలిఅని అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి రోడ్లమీదకి వస్తున్నారు గ్రామాల్లోకి వస్తున్నారు.
ఇది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల్లో కనబడలేదు, ఇతను పార్టీలో వాళ్ళు రెండు సంవత్సరాలు కరోనా చేసింది రాష్ట్రంలో ప్రపంచంలో దేశంలో ఆరోజు కూడా ఎమ్మెల్యేగా నేను మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మా నాయకులు కార్యకర్తలు ఆశా వర్కర్స్ సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికార యంత్రాంగం అంతా కూడా మీ మధ్య ఉన్నాం చనిపోతామని మేము భయపడలేదు,మీకు ధైర్యం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి మీ మధ్య తిరిగి వాళ్ళు ఎవరు కూడా కనబడలేదు.ఎలక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు వస్తున్నారు గ్రామాల్లోకి ఇది మీరు గమనించాలి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి,. జగన్మోహన్ రెడ్డి  చేసిన పథకాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఈరోజు చెప్పిన మాట ప్రకారం మీరు అడక్కపోయినా కూడా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి  మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి  ఉండాలి మీరే ఇచ్చారు, రాష్ట్రంలో 150 యొక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు,22 స్థానాల్లో పార్లమెంటు సభ్యులను గెలిపించారు అని అన్నారు.మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి  ఈరోజు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట జగన్మోహన్ రెడ్డి  పులివెందులకు పంపించాలంట అందరూ ఒకటవుతున్నారు, తెలుగుదేశం పిచ్చోడు పవన్ కళ్యాణ్ పార్టీ ఇప్పుడు మల్ల బిజెపితో మంత్రాలు చేస్తామన్నారు
కాంగ్రెస్తో మంత్రాలు చేస్తా ఉన్నారు, అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట సింహం కడుపులో సింహమే పుడుతుంది, కదా జగన్మోహన్ రెడ్డి  సింహం కడుపులో పుట్టాడు కాబట్టి ఎంతమంది ఒకటైన ఎంతమంది ఒకటైన ప్రజల ఆశీర్వాదం పైనున్న భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి ఉంది అని చెప్పారు.  మేము కూడా ధైర్యంగా మీ వద్దకు వచ్చి మేము ఫలానా పనిచేశాం, ఫలానా సంక్షేమ పథకాలు ఇచ్చినమని తల ఎత్తుకొని మీ దగ్గరికి వస్తాను, కాబట్టి వాళ్లు ఇప్పుడు వచ్చేవాగ్దానాలు చేస్తాడు 600 వాగ్దానాలు చేసే అధికారంలోకి వచ్చి ఆ 600 వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదు,చంద్రబాబు ఈరోజు మరల ఎలక్షన్స్ వస్తున్నాయని మీ వద్దకు వస్తున్నారు, డబ్బులు ఇస్తారంట 1000 నుంచి 5000 దాకా ఒక్కొక్క ఓటు ఇస్తారంట బంగారం గా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తు చేయండి గుద్దండి అని తెలిపారు. ఒక్క ఎకరా  ఉండింది ఈరోజు నాలుగు లక్షల కోట్లకు అధిపతి చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఏదో బలంగా తీసుకొస్తున్నారంట డబ్బు అంతా బంగారంగా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోవద్దు దయచేసి మీ ఇంట్లో బిడ్డగా ఈరోజు మీరు పెట్టిన బాధ్యతలు వమ్మ చేయకుండా చాలా బాగా చేశాడు చిన్నవాడైన వయసులో ప్రతి అవ్వ తాతని పలకరించాడు, ప్రతి అక్క చెల్లిని పలకరించాడు అన్న తమ్ముని పలకరించాడు, పేదరికం అనేది ఉండకూడదు రాష్ట్రంలో అందరూ బాగుండాలని చెప్పే భావించిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి  దయచేసి మీ మనసులో పెట్టుకోండి మూడు నెలల్లో ఎలక్షన్స్ పోగొద్దామన్న నేను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేయబోతున్నారు, మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కూడా మీ మధ్య తిరుగుతున్నాం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చేశాను సెంట్రల్ లైటింగ్ లో పెట్టాము సైట్ రింగ్స్ కట్టించాము రోడ్ సేసాము అన్ని కూడా చేశాం, బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలు మారుస్తానని చెప్పినాను మారుస్తున్నాను మార్చాను కూడా అని అన్నారు.చాలా వరకు మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానుఅని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసిపినాయకులు,అభిమానులు కార్యకర్తలు,అధికారులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్