Sunday, September 8, 2024

కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్..హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. !

- Advertisement -

హైదరాబాద్, సెప్టెంబర్ 28:  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంపై దృష్టి సారిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పెండింగ్‌ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేస్తూ… నిరుపేదలకు విడతల వారీగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను అందజేస్తూ… ప్రజల్లో ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇక.. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. ఇక… ఎన్నికల శంఖం పూరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో… రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. వచ్చే నెల అంటే అక్టోబర్‌లో కమలం పార్టీ 30 నుంచి 40 సమావేశాలు నిర్వహించబోతోంది. ఆ సమావేశాలకు పార్టీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి, సంక్షేమంపై పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించి వివరించాలని ప్లాన్ చేసింది. అంతేకాదు.. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించబోతున్నారు. బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేయనున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభకు 17 లోక్‌సభ స్థానాలను కూడా కేటాయించాలని భావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమం కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ఈ సభల ద్వారా కమలం పార్టీ నేతలు వివరించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తర్వాత ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌ జిల్లాలో, 3న నిజామాబాద్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా తెలంగాణ బీజేపీ కూడా బహిరంగ సభలు నిర్వహించింది. సభల ద్వారా ఎన్నికలను పూరించి ప్రచారంలో వేగం పెంచాలని మోదీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన అనంతరం… బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్టోబర్ 6న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత… అక్టోబర్ 7న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను నిర్వహించబోతున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.ఆదిలాబాద్ లో సభ నిర్వహించే అవకాశాలున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇలా… పార్టీ జాతీయ నేతలను తెలంగాణకు ఆహ్వానించి… వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగస్వాములను చేయనున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణలో పర్యటించేలా తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది.

exercise-for-the-management-of-meetings-in-the-state
exercise-for-the-management-of-meetings-in-the-state

హాట్‌హాట్‌గా బీజేపీ పదాధికారుల సమావేశం.. కిషన్‌రెడ్డిపై నేతల ఫైర్

బీజేపీ పదాధికారుల సమావేశం గత రాత్రి జరిగింది. ఈ సమావేశం హాట్‌హాట్‌గా జరిగినట్టు సమాచారం. పదాధికారుల సమావేశంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన కిషన్ రెడ్డిపై పలువురు నేతలు ఫైర్ అయ్యారు..

పార్టీ ఏం చేస్తుందో.. ఎన్నికలను ఎలా ఎదుర్కొంటోందో తమకు అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పార్టీని నమ్ముకుని నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామని.. మనం మాత్రం ఆఫీసుల్లో కూర్చుని మీటింగులు పెట్టుకుంటున్నామన్నారు.

exercise-for-the-management-of-meetings-in-the-state
exercise-for-the-management-of-meetings-in-the-state

అయితే పార్టీ మీటింగ్‌లో నెగిటివ్ గా మాట్లాడడం సరి కాదని కిషన్ రెడ్డి వారించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరి పదేళ్ళు అవుతుందని.. ఎలా మాట్లాడాలో తనకు తెలియదా? అంటూ పార్టీ కీలక నేత సంకినేని వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. వరంగల్ నరేంద్ర మోదీ సభకు, ఖమ్మం అమిత్ షా సభకు పెద్దగా జనం రాలేదని నేతలు పేర్కొన్నట్టు సమాచారం. అక్టోబర్ 1, 3న జరగనున్న ప్రధాని మోదీ సభలకైనా.. భారీగా జనాల్ని తరలించాలని కిషన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర కార్యాలయంలో తమను ప్రెస్ మీట్‌లు పెట్టనీయడం లేదని అధికార ప్రతినిధులు తెలిపారు. అధికార ప్రతినిధులుగా తమ రోల్ ఏంటో తెలుపాలని బీజేపీ నేతలు కోరారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్