Sunday, September 8, 2024

మేడిగడ్డ అద్బుతాలను వివరించండి

- Advertisement -
Explain the wonders of Madigadda
Explain the wonders of Madigadda

మేడిగడ్డ అద్బుతాలను వివరించండి
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్
తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం,  రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచింది.  వెంకటస్వామి  సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు. రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది. రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు. ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు. వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు. ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారని అన్నారు.
కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది. సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది.అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దామని అన్నారు.
కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి..  మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండని అన్నారు.
మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి. తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి. జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా? తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..? కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు. కాళేశ్వర్ రావు ని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా. మీకు బస్సుల్లో  రావడం ఇబ్బంది అనుకుంటే… హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది. రేపో ఎల్లుండో సాగునీటి  ప్రాజెక్టులపై మంత్రి  శ్వేతపత్రం విడుదల చేస్తారు. కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దామని అన్నారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్