పిర్జాదిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఇద్దరు వ్యక్తుల దుర్మరణం..!
ఒక వ్యక్తి పరిస్థితి విషమం..!
వాయిస్ టుడే న్యూస్, మే 20 మేడిపల్లి :
మేడ్చల్ జిల్లా, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం TS09 GD 2449 పిర్జాదిగూడ నుండి పర్వతాపూర్ కు త్రిబుల్ రైడింగ్ లో వెళ్తుండగా అరోరా కాలేజీ సమీపంలోని రాయించ ఎంక్లూవ్ కు చేరుకున్నప్పుడు ఎదురుగా వస్తున్న మహీంద్రా ఎస్సిడి. కారు బిఆర్ నెంబర్. TS08 JW 9558 తో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు పల్సర్ బైక్ పై ఉన్నా మాడే శ్రవణ్ సన్నాఫ్ రాములు, వయస్సు ౨౭ సంవత్సరాలు, ఒకేషన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, సాయి ఐశ్వర్య కాలనీ, మేడిపల్లి ఇతను అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీకర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొకరి పేరు మేటి శివ సన్నాఫ్ రాములు, వయస్సు 24 సంవత్సరాలు, ఒకేషణ్ ఎంజీఎం, వరంగల్, ఆర్వో, సాయి ఐశ్వర్య కాలనీ, మేడిపల్లి నెగిటివ్ ప్లేస్ రామవరం గ్రామం, కొడకండ్ల మండలం, జనగాం జిల్లా, ఇతను ఆసుపత్రిలో మరణించారు. ఎల్ భాను, సన్నాఫ్ బర్గాజి పేరుతో గాయపడిన వ్యక్తి వయస్సు 25 సంవత్సరాలు, ఆర్వో, రాధాకృష్ణ కాలనీ పీర్జాదిగూడ, TX హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని కేసు దర్యాప్తు చేస్తున్నాము అని మేడిపల్లి సిఐ ఆర్ గోవిందరెడ్డి తెలిపారు.



