Sunday, September 8, 2024

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద ఓ వంతెనపై మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీ
నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం
చెన్నయ్ జనవరి 25
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్ వద్ద ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్నాయి. మూడు ట్రక్కులు, రెండు కార్లు ఢీకొనడంతో.. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పొందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకోగా.. సీసీటీవీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.ఆ వీడియోని గమనిస్తే.. వేగంగా దూసుకొస్తున్న ఈ ట్రక్కు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రక్కులను ఢీకొంది. దీంతో.. ఒక ట్రక్కు అదుపు తప్పి వంతెనలో పడిపోయింది. ఈ మూడు ట్రక్కుల మధ్య వెళ్తున్న ఒక కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఇంతలోనే ఓ ట్రక్కుకు మంటలు అంటుకున్నాయి. మరోవైపు.. ఈ ప్రమాదంలో అనుసరిస్తున్న మరో కారు కూడా ధ్వంసం అయ్యింది. ఫలితంగా.. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం నలుగురు మృతి చెందారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే.. గాయాలైన వారికి రూ.50 వేల సహాయాన్ని అందజేశారు.ఈ ఘటనపై ధర్మపురి డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ స్పందిస్తూ.. పెండింగ్‌లో ఉన్న ఎలివేటెడ్ నేషనల్ హైవే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న భయంతోనే తాము తొప్పూర్ ఘాట్ సెక్షన్ వద్ద మంజూరైన ఎలివేటెడ్ హైవేని సత్వరమే అమలు చేయాలని పట్టుబడుతున్నామని ఆయన అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్