- Advertisement -
ఐదు కోట్ల నగదు పట్టివేత
నెల్లూరు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు నిఘా పెంచారు.ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ పరిధిలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు మూడు వేర్వేరు ప్రాంతాల వద్ద ఐదు కోట్ల 13 లక్షల రూపాయల ఆక్రమ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. బుదవాడ టోల్ ప్లాజా గూడూరు జాతీయ రహదారిపై మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహిస్తుండగా శక్రవారం తెల్లవారుజామున నలుగురు వేరువేరు వ్యక్తుల వద్ద 5 కోట్ల 13 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామన్నారు.
- Advertisement -