Sunday, September 8, 2024

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు  మృతి

- Advertisement -

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు  మృతి
నల్లగొండ డిసెంబర్ 25
నల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది. దీంతో బైకర్‌ కేశవులుతోపాటు పాదచారి సైదులు మృతిచెందారు. కేశవులు మరణవార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పెద్దవూర మండలం మల్లెవాని కుంట తండా నుంచి ఆటోలో ప్రమాద స్థలికి బయల్దేరారు. ఈ క్రమంలో పార్వతీపురం వద్ద వారి ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టింది.దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతులను గుణ్య, నాగరాజు, పాండ్య, బుజ్జిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో మల్లెవానికుంటలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్