- Advertisement -
త్వరలో తెలంగాణలో ఐదు కొత్త పథకాలు!
Five New Schemes Coming Soon to Telangana!
హైదరాబాద్
తెలంగాణ త్వరలో రేవంత్ సర్కార్ కొత్తగా 5 ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. మొదటగా సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీం అమలు చేయనుంది. అలాగే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, విద్యార్థులకు పోషకాహారం అందించే దిశగా మధ్యాహ్న భోజన పథకం విస్తరణ చేయాలని నిర్ణయించింది. దివ్యాంగ విద్యార్థులకు మోటారైజ్డ్ వాహనాలు అందించనుంది. అలాగే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ పంటలు పండించేలా, ప్రత్యామ్నాయమార్గాల వైపు ప్రోత్సహిస్తున్నారు. దీనికోసం రూ.10 వేల వరకు ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని భావిస్తోంది.
- Advertisement -



