Sunday, September 8, 2024

మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దారెటు.!

- Advertisement -

ఆ పార్టీలో ఆయన చాలా సీనియర్ లీడర్. పార్టీ మొదటి నుండి ఉన్న నేత. ఆ పార్టీ అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు అలాంటి వ్యక్తి పార్టీ మారుతారు అనే వార్తలు తెరమీదకు రావడంతో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‎గా మారింది. ఇంతకీ ఎవరా నేత.?మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దారెటు.! బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా.? కాంగ్రెస్‎లోకి వెళ్తారా.? ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతుంది. 2014, 2019లో నర్సాపూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచారు. 2023లో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసారు మదన్ రెడ్డి. కానీ కొన్ని కారణాల వల్ల నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్‎ను సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చింది బీఆర్ఎస్. అప్పటి నుండి కొంత బీఆర్ఎస్ పార్టీ‎పై అసహనంతో ఉన్నారు మదన్ రెడ్డి. ఎమ్మెల్యే టికెట్ వదులుకోవడానికి మనస్సు ఒప్పని మదన్ రెడ్డి చివరి వరకు విశ్వప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అప్పుడే పార్టీ మారుతారన్న ప్రచారం బీఆర్ఎస్‎లో జోరుగా సాగింది.

చివరికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్.. మదన్ రెడ్డికి మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కొంత వెనక్కి తగ్గారు. కానీ రాజకీయాల్లో పరిస్థితిలు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలవడం.. కాంగ్రెస్ అధికారంలో రావడంతో మదన్ రెడ్డికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్న మదన్ రెడ్డి మళ్ళీ పార్టీ మారుతారని మరోసారి వార్తలు వస్తున్నాయి. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మదన్ రెడ్డికి కాకుండా వెంకట్ రాంరెడ్డి‎కి ఇవ్వడంతో మదన్ రెడ్డి పార్టీ మార్పు మరోసారి తెరమీదకు వచ్చింది. తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు వేరే వాళ్ళకు ఇవ్వడంపై మదన్ రెడ్డి కొంత అలక పునినట్లు తన అనుచరులు చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించక పోవడంతో మదన్ రెడ్డి చూపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయంపై మైనంపల్లి హన్మంత్ రావుతో చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే తాను హస్తం పార్టీలో చేరుతాను అని చెప్పినట్లు తెలుస్తోంది. మరో వైపు మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతారు అని వార్తలు రావడంతో, కారు పార్టీ నేతలు కూడా అలర్ట్ అయ్యారు. పార్టీలో సీనియర్ లీడర్.. పార్టీ అధినేత కేసీఆర్‎కి సన్నిహితుడు కావున మదన్ రెడ్డి పార్టీ వీడి పోకుండా చర్యలు చేపట్టారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కౌడిపల్లిలోని మదన్ రెడ్డి ఇంటికి వెళ్లి కాసేపు మదన్ రెడ్డితో మాట్లాడారు. ఎంపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‎లో చేరుతారా అనే టెన్షన్ రెండు పార్టీల నేతల్లో మొదలు అయ్యింది. మదన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుంది.. ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్