అన్న క్యాంటీన్ కు శంకుస్థాపన
Foundation stone for Anna canteen
సాలూరు
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తాసిల్దార్ కార్యాలయం లో మంత్రి సంధ్యారాణి అన్నా క్యాంటీన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఈరోజు అన్న క్యాంటీన్ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పేదవాడి ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అని, గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ లను ధ్వంసం చేశారన్నారు ధ్వంసం చేశారన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ లు స్వాతంత్ర దినోత్సవ రోజునే పేదవాడికి ఆకలి తీరుస్తాయి, కొన్ని కారణాల వలన స్థల సేకరణ అలస్యమైంది లేదంటే సాలూరులో కూడా రేపే అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యేదని అన్నారు. అన్న క్యాంటీన్ నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసి ఐదు రూపాయలకే పేదవాడి ఆకలి తీరుస్తామని అన్నారు.



