మాల్ ప్రాక్టీస్ కు సహకరించిన నలుగురు లెక్చరర్లు సస్పెండ్
కామారెడ్డి జిల్లా
సదాశివనగర్ జూనియర్కాలేజీలో ఇంటర్ ఎగ్జామ్ససందర్భంగా మాస్ కాపీయింగ్కు సహకరించారని ఇద్దరు లెక్చరర్లతో పాటు, ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్అఫీసర్ లను సస్పెండ్్చస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సదాశివ్నగరాూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల సందర్భంగా సెంటర్ బయట బ్యాగుతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించాడు. వారిని చూసిన వెంటనే బ్యాగ్ వదిలి పారిపోబోగా పట్టుకున్నారు.అతడిని పట్టుకుని ఎంక్వెరీ చేయగా తన పేరు ఎండీ ఇప్రత్అని కాలేజీలో హిందీ లెక్చరర్న్న చెప్పాడు. బ్యాగులో చెక్ చేయగా హిందీ ఎగ్జామ్కు సంబంధించిన చిట్టీలు కనిపించాయి. చిట్టీలను సెంటర్ లో ఉన్న లెక్చరర్రంజిత్కు ఇచ్చేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో లెక్చరర్లు ఇశ్రత్, రంజిత్పై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన ఇంటర్బోర్డు లెక్చరర్లు ఇశ్రత్, బి.రంజిత్తో పాటు ఎగ్జామినేషన్ సెంటర్ చీఫూపరింటెండెంట్ ప్రతాప్తంగం, డిపార్ట్మెంట్ఆఫీసర్ రాజాగౌడ్లను సస్పెండ్ చేశారు. సెంటర్ లో కాపీయింగ్ జరగలేదని ఇంటర్మీడియట్ కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్సలాం తెలిపారు.