ఇంటిలిజెన్స్ అదుపులో నలుగురు మావోయిస్టులు

- Advertisement -

మంచిర్యాల:  ఇందారం గ్రామ సమీపంలోని ఒకరి ఇంటిలో ఉన్న నలుగురు మావోయిస్టులను ఎస్ఐబి  నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.  ఆరునెలల నుంచి నలుగురు మావోయిస్టులు మంచిర్యాల జిల్లాలో సంచరిస్తున్నట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి.  శనివారం ఇందారం ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఒక మాజీ మావోయిస్టు ఇంటిలో వారు ఉన్న విషయాన్ని తెలుసుకున్న నిఘా వర్గాలు ఆ ఇంటిని చుట్టిముట్టాయి. నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నావా,లేదా అనే విషయం ఇంకా నిఘా వర్గాలకు స్పష్టం కాలేదు. స్థానిక పోలీస్ బలగాలు కూడా ఆ ఇంటికి చేరుకుంటున్నాయి. నలుగురు మావోయిస్టులు లొంగిపోని నేపథ్యంలో ఎదురుకాల్పులు జరగడానికి కుడా పోలీసులు సిద్దపడ్డారు. పీఎల్జీయే a వారోత్సవాల నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోడానికే వచ్చినట్టు తెలుస్తోంది. స్థావరం పొందిన నలుగురు మావోయిస్టుల హోదా కూడా తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular