కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు
మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ మార్చ్ 10
Funds from the Centre are not an act of charity—they are Telangana’s right: Minister Ponnam Prabhakar.
రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ కు పొన్నం బహిరంగ సభ లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు అని తెలియజేశారు. పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు అని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని, కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.



